byసూర్య | Mon, Apr 22, 2024, 02:51 PM
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోమవారం బెంగుళూరుకు పయనమయ్యారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిపై డీకే. శివకుమార్తో భేటి కానున్నారు. కాగా, ఖమ్మం అభ్యర్థిగా మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి పేరు ప్రతిపాదించాలని కోరగా, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు మాత్రం కమ్మ సామాజిక వర్గానికి చెందిన రాయల నాగేశ్వరరావును అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.