byసూర్య | Mon, Apr 22, 2024, 02:51 PM
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి భూమిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని హెడ్మాస్టర్ కనకప్ప అన్నారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం నారాయణపేట జిల్లా జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేత ప్రతిజ్ఞ చేయించినట్లు చెప్పారు. భూమిని కాపాడేందుకు కాలుష్య కారకాలకు దూరంగా ఉండాలని, ప్లాస్టిక్ వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.