byసూర్య | Mon, Apr 22, 2024, 02:52 PM
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని తుర్క ఎన్కెపల్లి గ్రామంలో పరిగి ఎమ్మెల్యే ఆదేశానుసారం పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున సోమవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పూడూరు మండల పిఎసిఎస్ చైర్మన్ సతీష్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.