byసూర్య | Mon, Apr 22, 2024, 02:52 PM
నాగర్ కర్నూలు జిల్లా లింగాల మండలం పరిధిలో జరిగే సలేశ్వరం లింగమయ్య జాతరకు పోలీసు శాఖ తరపున పూర్తి బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ రఘునాథ్ గైక్వాడ్ వైభవ్ సోమవారం పేర్కొన్నారు. 300 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశామని, జెసిబి, ట్రాక్టర్లను అందుబాటులో ఉంచామని అన్నారు. భక్తులు కూడా పోలీసు శాఖకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం నుంచి బుధవారం వరకు జాతర జరుగుతుందని ఎస్పి తెలిపారు.