byసూర్య | Mon, Apr 22, 2024, 02:54 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎండల తీవ్రతతో రోజురోజుకు భూగర్భజలాలు పాతాళానికి తగ్గిపోతున్నాయి. వరి పొలాలు, కూరగాయలు నీరు అందక ఎండిపోతున్నాయి. 17మండలాలలో తీవ్ర నీటి కొరత ఏర్పడింది. వెల్దండ, ధరూర్, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, ధన్వాడ, హన్వాడ, గండీడ్, మానవపాడు, కేటిదొడ్డి, నవాబుపేట, గుండుమాల్, కల్వకుర్తి, కోయిలకొండ, కొత్తకోట, నాగర్ కర్నూల్, మదనాపూర్ మండలాలలో భూగర్భ జలాలు పడిపోయాయని సోమవారం రాజేంద్ర కుమార్ తెలిపారు.