byసూర్య | Mon, Apr 22, 2024, 02:57 PM
ఎల్లారెడ్డి సెగ్మెంట్లోని సదాశివనగర్ మండల కేంద్రంలో కలియుగ దైవం శ్రీశ్రీశ్రీ అయ్యప్పస్వామి ఆలయ ద్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం సోమవారం శాస్త్రోపేతంగా జరిగింది. ఈ ప్రతిష్టాపన కార్యక్రమానికి ఎల్లారెడ్డి శాసనసభ్యులు కె. మదన్ మోహన్ రావు హాజరై పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఎమ్యెల్యేను శాలువ కప్పి సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.