byసూర్య | Mon, Apr 22, 2024, 10:36 AM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని నల్లమల్ల అభయ అరణ్యంలో ఎత్తైన కొండకు దిగువన వెయ్యిఅడుగుల లోతులో కొలువైన లింగమయ్య స్వామి దర్శనం, సలేశ్వరం జాతర సోమవారం నుంచి బుధవారం వరకు మూడు రోజులపాటు జరుగుతుంది. ఈ జాతర తెలంగాణ అమర్నాథ్ యాత్రగా పేరుపొందింది. ఈ జాతరకు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు.