ఆర్టీసీ బస్‌ డిపోలో చోరీ కలకలం

byసూర్య | Mon, Sep 23, 2024, 12:20 PM

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్‌ డిపోలో చోరీ కలకలం రేపింది. సెప్టెంబర్ 22న అర్ధరాత్రి సమయంలో ఆర్టీసీ బస్సు చోరీకి గురికావడం అందరినీ షాక్‌ అయ్యేలా చేసింది.దీంతో అధికారులు, సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లిన ఘటన విని ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలోనే డిపో నుండి రెండు కిలో మీటర్ల దూరంలో సోఫీ నగర్ వద్ద బస్సు ప్రమాదానికి గురైంది. దాంతో అక్కడే నిలిచిపోయింది. అది గమనించిన ఆర్టీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, ఇక్కడ ఏం జరిగిందంటే.


మహారాష్ట్రకు చెందిన గణేష్‌ అనే వ్యక్తి మద్యం మత్తులో ఆర్టీసీ డిపో గోడదూకి లోపలిని ప్రవేశించాడు. తాగిన మైకంలో ఆర్టీసీ బస్సును తీసుకెళ్లాడు. అక్కడి నుంచి సోఫీ నగర్ వైపు వెళ్ళగా కంచరోని చెరువు సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. గమనించిన స్థానికులు వెంటనే ఆర్టీసీ కార్యాలయానికి సమాచారం అందించారు.. ఆర్టీ సెక్యూరిటీ సిబ్బంది వెంబడించి కడ్తాల్ గ్రామ సమీపంలో బైపాస్ దగ్గర అతడిని పట్టుకున్నారు. కాగా, పోలీసుల విచారణలో బస్సు ఆగి ఉంటే తీసుకొచ్చానని నిందితుడు చెప్పినట్టుగా తెలిసింది.


Latest News
 

దాదిగూడెం నూతన మత్స్యకార సంఘం ఏర్పాటు : నీలం మధు ముదిరాజ్ Mon, Sep 23, 2024, 02:48 PM
ఓటర్ జాబితా రూపకల్పనకు సహకరించాలి: జిల్లా కలెక్టర్ Mon, Sep 23, 2024, 01:41 PM
రేవంత్ రెడ్డిని కలిసిన సూపర్ స్టార్ మహేష్ బాబు Mon, Sep 23, 2024, 12:35 PM
బీఆర్ఎస్ క్యాడర్‌పై అక్రమ కేసులు పెడితే సహించేది లేదు : హరీష్‌రావు Mon, Sep 23, 2024, 12:27 PM
చైర్మన్ ను సన్మానించిన రాజారాంపల్లి మాజీ సర్పంచ్ Mon, Sep 23, 2024, 12:23 PM