byసూర్య | Mon, Apr 22, 2024, 10:58 AM
షాద్ నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెంకట మాధవ రావు, ఫరూక్ నగర్ మండలం రెవిన్యూ అధికారి పార్థసారథి పర్యవేక్షణలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్లు స్ట్రాంగ్ రూమ్ లో ఆదివారం భద్రపరిచారు. 328 బ్యాలెట్ ఈవీఎంలు, 368వీవీ ప్యాట్లు, 328 కంట్రోల్ యూనిట్స్ పోలింగ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. స్ట్రాంగ్ రూములో ఈవీఎంలను భద్రత పరిచి గదులను సీజ్ చేసినట్లు తెలిపారు.