byసూర్య | Sun, Apr 21, 2024, 03:34 PM
నల్లగొండ జిల్లా రామన్నపేట మండల కేంద్రం భువనగిరి బిజెపి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ విజయం కోసం ఎస్సీ మోర్చా జనరల్ సెక్రెటరీ నకీరేకంటి మొగులయ్య ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికి తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి బూర ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.