byసూర్య | Sun, Apr 21, 2024, 03:25 PM
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మం పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఆదివారం ఉదయం నగరంలోని లకారం ట్యాంక్ బండ్ వద్ద వాకర్స్ ను కలిశారు. ఈ సందర్భంగా రానున్న లోక్సభ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్ధించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ కర్నాటి క్రిష్ణ, బిక్కసాని జస్వంత్, చిరుమావిళ్ళ నాగేశ్వర్ రావు, మోరంపుడి ప్రసాద్, నామ భవ్యతేజ, బోగ గిరి తదితరులు పాల్గొన్నారు.