byసూర్య | Sun, Apr 21, 2024, 03:24 PM
నూతనంగా న్యాయవాద వృత్తిలోకి వచ్చిన జూనియర్ న్యాయవాదులు నిరంతరం న్యాయశాస్త్రాలను అధ్యయనం చేయాలని సీనియర్ సివిల్ జడ్జి అరుణకుమారి అన్నారు. సత్తుపల్లి కళాభారతిలో శనివారం ఐఏఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్. ఇమావలి అధ్యక్షతన జరిగిన స్టడీ సర్కిల్ కు ఆమె పాల్గొని మాట్లాడారు. గౌరవ ప్రదమైన వృత్తిని ఎంచుకోవడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి న్యాయవాద వృత్తి ఎంతో తోడ్పడుతుందన్నారు.