byసూర్య | Sun, Apr 21, 2024, 03:24 PM
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ మండలాధ్యక్షుడు బొర్రా నరసింహారావు అన్నారు. ఈ సదర్భంగా శనివారం పెనుబల్లి మండల పరిధిలోని మండాలపాడు, గొల్లగూడెం బూత్లలో నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మున్నా మిశ్రా, అధికార ప్రతినిధి పడిగల మధుసూధన్ రావు తదితరులు పాల్గొన్నారు.