byసూర్య | Sun, Apr 21, 2024, 03:23 PM
ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో ఉన్న రోటరీ కమ్యూనిటీ సర్వీస్ సెంటర్ లో శనివారం 25 మంది దివ్యాంగులకు రోటరీ క్లబ్ ఆఫ్ ఖమ్మం ఆధ్వర్యాన కృత్రిమ పాదాలను అందించారు. అమెరికాలో స్థిరపడిన దేశరాజు రవి, శైలజలు ఎన్ఆర్ఐ ఫౌండేషన్ ద్వారా అందించిన ఆర్థిక సాయంతో రోటరీ క్లబ్ దివ్యాంగులకు ఉచితంగా పాదాలను అందించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు కె. వెంకటరెడ్డి, బోనాల రామకృష్ణ, బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.