byసూర్య | Sun, Apr 21, 2024, 03:23 PM
నిరుద్యోగ యువతే లక్ష్యంగా మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం సీపీ సునీల్ దత్ తెలిపారు. నల్లగొండ జిల్లాకు చెందిన పారేపల్లి సాయికృష్ణ అలియాస్ సాయి, ఆయన సహచరుడు పెట్రోల్ బంక్ ఉద్యోగి రావులపాటి శివ హైదరాబాద్లోని ఎల్బీనగర్లో నివాసముంటున్నారు. వివిధ ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులకు మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని మోసం చేస్తున్నారు.