byసూర్య | Sun, Apr 21, 2024, 03:16 PM
చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో భువనగిరి సీపీఎం ఎంపీ అభ్యర్థి ఎండీ జహంగీర్ను ఓటు వేసి గెలిపించాలని కోరుతూ గ్రామంలో ఆదివారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం జిల్లా ఉపాధ్యక్షులు దేశబోయిన స్వరూప నరసింహ, సీపీఎం గ్రామ కార్యదర్శి పంది నరేశ్, నాతి కిరణ్, అరూరి శంబయ్య కూరాకుల బాలు, గోలి సాయికిరణ్, అరూరి పవన్ , సైదులు పాల్గొన్నారు.