byసూర్య | Sun, Apr 21, 2024, 03:36 PM
నార్కెట్ పల్లి అద్దంకి రహదారిపై బొత్తలపాలెం వద్ద శనివారం జరిగిన ప్రమాదంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు నకిరికంటి సైదయ్య మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బొత్తల పాలెం ప్రాథమికోన్నత పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సైదులు విధులకు ద్విచక్ర వాహనంపై వెళుతున్నాడు. ఆటో ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు కాగా వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని పోలీసులు తెలిపారు.