byసూర్య | Sun, Apr 21, 2024, 03:47 PM
2024 మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పోగొట్టుకోవద్దని నల్లగొండ జిల్లా నాంపల్లి పట్టణ అంకురం యూత్ అధ్యక్షుడు గాదేపాక రవీందర్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగబద్ధ ప్రజాస్వామ్య దేశంలో ఇది పౌరుల ప్రధాన కార్తవ్యం అని అన్నారు. ఓటు చాలా విలువైనదన్నారు. దేశ తలరాతను మార్చగల శక్తి ఒక్క ఓటు అనే ఆయుదానికి ఉందన్నారు.