byసూర్య | Sun, Apr 21, 2024, 03:56 PM
కూసుమంచి మండలం కోక్యాతండాకు చెందిన హలావత్ సాయికుమార్ కు జర్మనీలోని కార్లూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో వరిపై పరిశోధన చేసే అవకాశం లభించింది. వరిలో నీటి ఎద్దడిని తట్టుకునే వంగడాల రూపకల్పనపై పరిశోధనకు అక్కడి ప్రభుత్వం అనుమతించిందని సాయికుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆయన ఉత్తరప్రదేశ్ లోని సామ్ హిగ్గిన్ బాటమ్ యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చర్ లో జన్యుశాస్త్రంలో పీహెచ్డీ చేసున్నారు.