యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు

byసూర్య | Sat, Sep 21, 2024, 11:26 PM

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారాన్ని వైరల్ చేసి.. సామాన్య ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లపై హైదరాబాద్‌ పోలీసులు కొరఢా ఝళిపిస్తున్నారు. ఇందులో భాగంగానే.. పలు యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకున్న షాహీనాయత్ గంజ్ పోలీసులు.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ముస్లింల పండగ అయిన మీలాదుల్ నబీ పర్వదినం సందర్భంగా.. గోషామహల్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో (500 మంది) ముస్లింలు కలిసి హిందువుల ఇళ్లపై దాడి చేస్తున్నారంటూ.. తప్పుడు సమాచారాన్ని పలు యూట్యూబ్ ఛానళ్లు (9 భారత్ సమాచార) ప్రసారం చేశాయి. అంతేకాకుండా.. అందుకు సంబంధించిన లింకులను పలు వాట్సప్ గ్రూపుల్లో ఫార్వర్డ్ కూడా చేశాయి.


ఈ వార్తలు పోలీసుల వరకూ చేరటంతో వాటిని పరిశీలించగా.. అందులో ఉన్న సమాచారం ఇరు వర్గాలను రెచ్చగొట్టి.. శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉందని నిర్ధారించుకుని.. సదరు యూట్యూబ్ ఛానళ్లపై కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగానే.. 9 భారత్ సమాచార్ అనే ఓ హిందీ ఛానల్ యొక్క ఛైర్మన్ మహేష్ ఉపాధ్యాయతో పాటు నరేష్ అనే కెమెరామెన్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


వీరిద్దరితో పాటు చార్మినార్ వద్ద లాఠీఛార్జ్ జరుగుతోందని E20 న్యూస్ ఛానల్‌లో వార్తలు ప్రసారం చేసి.. అసత్య ప్రచారం చేసినట్టుగా గుర్తించిన పోలీసులు.. అందుకు బాధ్యులైన శౌకత్ అహ్మద్ అనే వ్యక్తితో పాటు, ఆ సమాచారాన్ని సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన సందీప్ బొహరా అనే మరో వ్యక్తిని కుడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


విశ్వసనీయత లేని చిన్నా చితక ఛానళ్లలో ప్రసారమయ్యే అసత్య ప్రచారాలను ప్రజలు ఎవరూ నమ్మొద్దని పోలీసులు సూచించారు. మరోవైపు.. ప్రజల్లో ద్వేషభావాలు రగిలించి.. ఘర్షణలు చెలరేగేందుకు కారణమయ్యే అసత్యమైన, సున్నితమైన వార్తలు ప్రసారం చేసినా.. అందుకు సంబంధించిన వీడియోలు ఎవ్వరు షేర్ చేసినా.. ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానళ్లతో పాటు సోషల్ మీడియాల్లో షేర్ వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.


ప్రస్తుతం మార్కెట్‌లో మెయిల్ ఐడీ ఉన్న ప్రతి ఒక్కరు ఓ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నారు. అయితే.. చాలా వరకు పర్సనల్‌గా వ్లాగ్స్‌ అని, కుకరీ వీడియోలంటూ, భక్రి వీడియోలని, షాపింగ్ వీడియోలంటూ, ట్రావెల్ వ్లాగ్స్ అంటూ రకరకాల యూట్యూబ్ ఛానళ్లు రన్ చేస్తున్నారు. అయితే.. వీటన్నింటితో పాటు గల్లీకో న్యూస్ యూట్యూబ్ ఛానళ్లు కూడా వెలిశాయి. ఇందులో కొన్ని ప్రామాణిక వార్తలు ప్రసారం చేస్తూ, విశ్వసనీయతతో ఉంటే.. మరికొన్ని మాత్రం నోటికొచ్చింది చెప్తూ.. వాట్సప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టే తలా తోక లేని సమాచారాలను కూడా వార్తల్లా మలిచి సామాన్య ప్రజలను అయోమయంలోకి నెట్టేస్తున్నాయి. అలాంటి ఛానళ్ల వల్ల ప్రామాణిక వార్తలను ప్రసారం చేసే ఛానళ్లపై కూడా విశ్వసనీయత కోల్పేయే పరిస్థితులు ఏర్పడటం శోచనీయం


Latest News
 

తిరుమల శ్రీవారి లడ్డూ వివాదం.. బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన కామెంట్స్ Sat, Sep 21, 2024, 11:39 PM
అటు భారీ వర్షం.. ఇటు సీఎం కాన్వాయ్ Sat, Sep 21, 2024, 11:34 PM
విదేశీ పర్యటనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,,,,అమెరికా, జపాన్, టోక్యోలో పర్యటన Sat, Sep 21, 2024, 11:29 PM
యూట్యూబ్ ఛానళ్లపై పోలీసుల నజర్,,,,అసత్య సమాచారం ప్రచారం చేసిన ఛానళ్లపై చర్యలు Sat, Sep 21, 2024, 11:26 PM
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్,,,,ఆయన భార్యపై కూడా కేసులు Sat, Sep 21, 2024, 11:20 PM