byసూర్య | Sat, Apr 20, 2024, 12:07 PM
నల్గొండ-నకిరేకల్ రహదారిలో పెద్ద సూరారంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రామన్నపేట పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు. సుందర్ రావు సమీప బంధువు మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యారు. అనంతరం నల్గొండకు వస్తుండగా పెద్ద సూరారం వద్ద అడవి పందులు రోడ్డుకు అడ్డుగా రావడంతో వాటిని తప్పించబోయి చెట్టుకు బలంగా ఢీకొట్టడంతో సుందర్ రావు అక్కడికక్కడే మృతి చెందారు.