byసూర్య | Sat, Apr 20, 2024, 12:05 PM
భానుడి భగభగలకు వన్యప్రాణులు తల్లడిల్లకుండా వాటి సంరక్షణ కోసం అటవీ శాఖ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ జిల్లా ఉమ్మడి చందంపేట మండలంలో నల్లమల అటవీప్రాంతం విస్తరించి ఉంది. వేసవిలో పుణ్యప్రాణులు తాగునీటి కోసం అడవి నుంచి బయటకు రాకుండా అటవీ ప్రాంతంలో సాసర్ పిట్లను ఏర్పాటు చేసి ట్యాంకర్ల ద్వారా నీటిని నింపుతున్నారు. అలాగే సోలార్ బోర్లు, గడ్డి మైదానాలు ఏర్పాటు చేస్తున్నారు.