byసూర్య | Sat, Apr 20, 2024, 12:10 PM
మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ పార్లమెంట్ల పరిధిలో త్రిముఖ పోరు కొనసాగనుంది. నువ్వా. నేనా. అన్నట్లు అన్ని గ్రామాలలో ఇప్పటికే అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. గెలుపే లక్ష్యంగా ఒకరిపై ఒకరు విమర్శలు కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు ఆయా జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ క్షేత్రస్థాయిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నామినేషన్ల అనంతరం ప్రచారం జోరుగా కొనసాగనుంది.