byసూర్య | Sat, Apr 20, 2024, 12:11 PM
ఎగువ జూరాల విద్యుదుత్పత్తి కేంద్రంలోని మూడో యూనిట్ మరమ్మతుకు చర్యలు తీసుకుంటున్నామని శుక్రవారం జెన్ కో ఎస్ఈ (ఓఅంర్ఎం) రామసుబ్బారెడ్డి తెలిపారు. వర్షాకాలంలో మూడో యూనిట్లోని స్ట్రేటర్ లో సాంకేతిక సమస్యలు ఏర్పడి విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో యూనిట్లోని యంత్రసామగ్రిని వెలుపలికి తీశామన్నారు. మూడో యూనిట్ మరమ్మతులు పూర్తి చేసేందుకు దాదాపు ఏడాది సమయం పట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని పేర్కొన్నారు.