byసూర్య | Sat, Apr 20, 2024, 12:14 PM
ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదు అవుతున్నాయి. శుక్రవారం నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా. అత్యధికంగా వనపర్తి జిల్లా వెలుగొండలో 45. 1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ లో 44. 3, నారాయణపేట జిల్లా ధన్వాడలో 44. 1, మహబూబ్ నగర్ జిల్లా ఉడిత్యాలలో 43. 9, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో 43. 8 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వైద్యులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.