byసూర్య | Sat, Apr 20, 2024, 12:16 PM
నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో నిర్వహించే సలేశ్వరం జాతర ను కనీసం ఐదు రోజుల నిర్వహించాలని బిజెపి నేత ఎంపీ రాములు శుక్రవారం అటవీశాఖ అధికారులను కోరారు. బిజెపి నాయకులు మండికారి బాలాజీ ఆధ్వర్యంలో శుక్రవారం సలేశ్వరం జాతర కుదింపుపై ఎంపీ రాములు కు ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై ఎంపి రాములు అటవీశాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఇబ్బంది కలిగించవద్దని కోరారు.