byసూర్య | Sat, Apr 20, 2024, 12:19 PM
రెండు రోజుల క్రితం మహబూబ్ నగర్ పట్టణం సమీపంలోని మయూరి పార్కులో అనుమానాస్పదంగా మృతి చెందిన యువతి వికారాబాద్ జిల్లా బషీర్ బాద్ మండలం పర్వతానికి చెందిన తాండూరు లక్ష్మీ (26)గా శుక్రవారం పోలీసులు గుర్తించారు. జిల్లా కేంద్రంలోని న్యూటౌన్ లో ముగ్గురు స్నేహితురాళ్లు కలిసి ఉంటూ. గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17న ఊరికి వెళుతున్నానని తన మిత్రులతో చెప్పింది. యువతీ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.