byసూర్య | Sat, Apr 20, 2024, 12:21 PM
మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దేశానికే ఆదర్శమని టిడిపి రాష్ట్ర నాయకులు ఓంప్రకాష్ అన్నారు. శనివారం చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ చిన్న పిల్లల ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అంతకుముందు హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు. నాయకులు పాల్గొన్నారు.