byసూర్య | Sat, Apr 20, 2024, 12:22 PM
దేవరకరూ నియోజకవర్గం కేంద్రంలో శ్రీ ఈశ్వర వీరప్పయ్య స్వామి రథోత్సవం భక్తిశ్రద్ధలతో సాగింది. 95 వ సప్తాహ మహోత్సవాలు వారం రోజులుగా కొనసాగుతున్నాయి అందులో భాగంగా శనివారం తెల్లవారుజామున సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై స్వామివారలను ఆసీనులు చేయగా భక్తులు జయ జయ ద్వానాలతో రథాన్ని లాగారు. గ్రామంలోని చెన్నకేశవ స్వామి ఆలయం వరకు రథోత్సవం సాగింది. రథం ముందు భజన పాటలు నృత్యాలు, మేళతాళాలతో ఘనంగా నిర్వహించారు.