byసూర్య | Sat, Apr 20, 2024, 12:23 PM
భిక్కనూరు మండలంలోని తిప్పాపూర్ గ్రామంలో జరిగే శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు హాజరుకావాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు శుక్రవారం ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈనెల 22 నుండి 24 వరకు వారి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు సిద్ధిరాములు తెలిపారు. ఈనెల 24న జరిగే స్వామివారి కల్యాణానికి హాజరుకావాలని కోరారు. ఉత్సవాల్లో భాగంగా ఆలయం వద్ద ధ్వజస్తంభం ప్రతిష్ట మహోత్సవం నిర్వహించనున్నారు.