byసూర్య | Sat, Apr 20, 2024, 12:25 PM
ముదిరాజుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి పెద్దపీట వేశాడని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ప్రభుత్వ సలహాదారుడు మహ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. శుక్రవారం దోమకొండలోని పెద్దమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీకి ఆలయ కమిటీ అధ్యక్షుడు లక్ష్మణ్ శాలువా కప్పి సన్మానించారు.