హైదరాబాద్‌లో బీఆర్ఎస్‌కు మరో షాక్... రేపు కాంగ్రెస్‌ గూటికి ఇంకో ఎమ్మెల్యే

byసూర్య | Fri, Apr 19, 2024, 07:26 PM

లోక్‌సభ ఎన్నికల వేళ.. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. బీఆర్ఎస్‌కు చెందిన పలువురు నాయకులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. తాజాగా, మరో ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్.. కాంగ్రెస్ గూటికి వెళ్లడం దాదాపు ఖాయమైంది. ముఖ్యమంత్రి అనముల రేవంత్ రెడ్డిని ఆయన శుక్రవారం కలిసి.. పార్టీలో చేరికపై చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. శనివారం ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రకాశ్ గౌడ్ పార్టీ మార్పుపై గత రెండు నెలలుగా చర్చ జరుగుతోంది.


గత జనవరిలో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌.. సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లి... రేవంత్‌ రెడ్డికి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో.. ప్రకాశ్ గౌడ్ పార్టీ మారబోతున్నారనే ప్రచారం సాగింది. అయితే, ఈ ప్రచారాన్ని అప్పట్లో ఆయన తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని రాజేంద్రనగర్ ఎమ్మెలయే క్లారిటీ ఇచ్చారు. తన నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్ మండలం కొత్వాల్ గూడ, బహదూర్ గూడా, ఘన్సిమియా గూడా గ్రామాల్లో ఉన్న భూ సంబంధ సమస్యలు పరిష్కారించాలని ముఖ్యమంత్రిని కోరినట్టు తెలిపారు.


అలాగే నియోజకవర్గం అభివృద్ధికి ప్రతేక నిధులు మంజూరు చేయాలని కోరినట్లు ప్రకాశ్ గౌడ్ స్పష్టం చేశారు. తన విజ్ఞప్తిపై రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని.. ఇందులో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ఇప్పటికే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. గతేడాది డిసెంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 65 స్థానాలు గెలిచి అధికారం చేపట్టింది. బీఆర్ఎస్ పార్టీ 39 సీట్లకే పరిమితమైంది. దీంతో గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోడానికి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM