కొత్త రేషన్‌ కార్డుల పంపిణీకి ముహూర్తం.. మంత్రి పొన్నం ప్రభాకర్

byసూర్య | Fri, Apr 19, 2024, 07:22 PM

లోక్ సభ ఎన్నికల వేళ... తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే.. రాష్ట్రంలో నోటిఫికేషన్ రావటంతో ఆయా పార్టీల ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. పార్టీల నేతలు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే.. అధికార పార్టీ కాంగ్రెస్ అధిక ఎంపీ స్థానాలు గెలుచుకుని అసెంబ్లీ ఎన్నికల జోష్ కంటిన్యూ చేయాలని అన్ని రకాలుగా కృషి చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్నింటినీ అమలు చేశామని.. మిగతావి కూడా త్వరలోనే అమల్లోకి తీసుకొస్తామని చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ఇచ్చిన హామీపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు.


లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్.. కరీంనగర్‌లో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్‌ పార్టీలకు ఓటు వేసి విలువైన ఆయుధాన్ని వృథా చేసుకోవద్దని.. ఓటర్లకు మంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రానికి, కరీంనగర్‌కు ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదంటూ దుయ్యబట్టారు. కరీంనగర్ అభివృద్ధికి తాను సిద్ధమని బోయినపల్లి వినోద్ కుమార్ సిద్ధమా..? అంటూ మంత్రి సవాల్ చేశారు. అతి త్వరలో కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయంటూ మంత్రి పొన్నం గుడ్ న్యూస్ వినిపించారు. ఎన్నికలు ముగిసిన వెంటనే కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. అంతేకాదు.. వచ్చే ఆగష్టు 15వ తేదీ లోపు రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని మంత్రి పొన్నం హామీ ఇచ్చారు.


 మరోవైపు.. వచ్చే వానాకాలం పంటకు రూ.500 బోనస్ ఇస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు. రైతులు అంటేనే కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ అంటేనే రైతులు అంటూ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ సర్కారు ప్రజాపాలన అందిస్తోందని... ప్రజల్లో ప్రభుత్వానికి వస్తోన్న ఆదరణ చూసి ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కసుతో ప్రభుత్వంపై బోగస్ మాటలు మాట్లాడుతున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా ఐదేళ్లు సుస్థిరంగా ఉంటుందని స్పష్టం చేసారు. వినోద్ కుమార్‌ను ఓడించడానికి గతంలో గంగుల కమలాకర్.. లోపాయికారి ఒప్పందం చేసుకున్నారన్నారు. పేద ప్రజల భూములను లాక్కున్న వారిని వదిలిపెట్టబోమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.


Latest News
 

ఢిల్లీ సుల్తానులు భయపెట్టాలని చూస్తున్నారు.. మోదీ, అమిత్ షాలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ Thu, May 02, 2024, 08:37 PM
వారెవ్వా.. పెట్రోల్ బంక్ యజమాని ఐడియా అదుర్స్.. క్యూ కడుతున్న కస్టమర్స్ Thu, May 02, 2024, 08:32 PM
భానుడి ఉగ్రరూపం.. సాధారణం కన్నా 2.1 డిగ్రీలు అధికం, జాగ్రత్తలు తీసుకోండి Thu, May 02, 2024, 08:20 PM
ఛత్తీస్‌గఢ్‌‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు తెలంగాణ మావోయిస్టులు మృతి, వీరిపై లక్షల్లో రివార్డు Thu, May 02, 2024, 08:14 PM
ఎన్నికపై వివాదం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి హైకోర్టు నోటీసులు Thu, May 02, 2024, 08:11 PM