byసూర్య | Fri, Apr 19, 2024, 03:39 PM
కామారెడ్డి పట్టణంలోని సిఎస్ఐ చర్చి కాంపౌండ్ లో గురువారం ఉదయం ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి శవం లభ్యమైనట్లు పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. మగ వ్యక్తి శవాన్ని పరిశీలించగా వయసు దాదాపు 30 నుంచి 40 సంవత్సరాలు ఉంటుందని, ఎడమ చేతి పై హార్ట్ సింబల్ ఉండి ఒకవైపు ఎస్, మరొకవైపు ఆర్ లెటర్స్ ఉన్నట్లు చెప్పారు. మెడలో రుద్రాక్ష మాల ఉందని, నలుపు రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు.