byసూర్య | Fri, Apr 19, 2024, 03:38 PM
ఫస్ట్ రాండమైజేషన్లో భాగంగా సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపును కలెక్టర్ అనురాగ్ జయంతి శుక్రవారం పరిశీలించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని సర్ధాపూర్ ఈవీఎం గోడౌన్ నుంచి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్ లకు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల తరలింపు ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు.