byసూర్య | Fri, Apr 19, 2024, 03:29 PM
నాగర్ కర్నూల్ జిల్లా ఫార్మసిస్ట్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన ఎండి మగ్దుం ఈరోజు ఎన్నికయ్యారు. నాగర్ కర్నూల్ పట్టణంలో జరిగిన ఒక సమావేశంలో మగ్దూం ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఫార్మసిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు అవకాశం కల్పించిన జిల్లా, రాష్ట్ర ఫార్మసిస్టు సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.