ప్రచారంలో దూసుకెళ్తున్న ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి

byసూర్య | Fri, Apr 19, 2024, 01:22 PM

నల్లగొండ బిజెపి పార్లమెంటు అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ప్రచారంలో శుక్రవారం నలగొండలో దూసుకెళ్తున్నారు. నల్లగొండ పార్లమెంటు పరిధిలోని నల్లగొండ, కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ పలు ప్రాంతాలలో ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశం నేడు ఒక చరిత్రత్మక సందర్భంలో ఉంది అని అన్నారు. దూర దృష్టి గల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ గత పది సంవత్సరాల నిర్విరామ కృషి, అంకితభావం, పట్టుదల కారణంగా దేశం వికసిత్ భారత్ దిశగా గొప్ప ముందడుగు వేసిందని అన్నారు. గత పది సంవత్సరాల కాలంలో భారతదేశం నమ్మశక్యం కాని రీతిలో అసాధారణ అభివృద్ధి సాధించిందని అన్నారు.


అయోధ్య రామజన్మ భూమిలో భవ్యమైన రామ మందిర నిర్మాణంతో 500 సంవత్సరాల హిందువుల కల సహకారం అయిందని అన్నారు. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అదినీయమ్ బిల్లు పాస్ అయిందని అన్నారు. ఆర్టికల్ 370 రద్దుతో తొలగిన కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి, శాంతి స్థాపనతో అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయి అన్నారు. ట్రిపుల్ తలాక్ నిషేధంతో ముస్లిం మహిళలకు రక్షణ కలిగిందని అన్నారు. విజయవంతంగా జి20 సమావేశాలు నిర్వహించి ప్రపంచ దేశాల నుంచి ప్రసంచలు పొందాయని అన్నారు.ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని అన్నారు.


Latest News
 

మంచిర్యాల జిల్లాలో వడదెబ్బతో ఇద్దరి మృతి Thu, May 02, 2024, 05:01 PM
ఈవీఎంల అనుబంధ ర్యాండమైజేషన్ పూర్తి: జిల్లా కలెక్టర్ Thu, May 02, 2024, 04:56 PM
దేశం అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ను గెలిపించాలి Thu, May 02, 2024, 04:50 PM
పెద్దమందడిలో బిఆర్ఎస్ నాయకుల ప్రచారం Thu, May 02, 2024, 04:33 PM
క్షణికావేశంలో భార్యను చంపిన భర్త Thu, May 02, 2024, 04:31 PM