byసూర్య | Fri, Apr 19, 2024, 01:14 PM
వడదెబ్బకు గురై ఒకరు మృతి చెందిన సంఘటన హుజూర్నగర్ లో చోటుచేసుకుంది. హుజూర్ నగర్ కు చెందిన మహేష్ విధులు ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాత గురువారం రాత్రి ఆస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఓ ఆసుపత్రి తీసుకెళ్లగా మెరుగైన చికిత్స కొరకు ఖమ్మం తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు