byసూర్య | Fri, Apr 19, 2024, 11:14 AM
చర్ల మండల పరిధిలోని పూజారిగూడెం పెద్ద చెరువు కట్ట వద్ద ముత్యాలమ్మ వారి గుడి నిర్మాణం కోసం చర్ల నివాసి, ప్రస్తుతం భద్రాచలంలో ఉంటున్న గూడూరి రామారావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. పది రోజుల్లో గుడి నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. తమ సొంత ఖర్చులతో ఈ ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేయనున్నామన్నారు. అలాగే గ్రామంలో సోముల దేవమ్మ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తున్నారు.