byసూర్య | Thu, May 02, 2024, 03:53 PM
దేశం కోసం, దేశ పరిరక్షణ కోసం 24 గంటలు పని చేస్తున్న నరేంద్ర మోడీని చూసి బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపిస్తే నల్గొండ జిల్లా న్యాయవాదుల సమస్యల పరిష్కారాన్ని మోడీ దృష్టికి తీసుకుపోయి మీ యొక్క సమస్యలు పరిష్కరిస్తానని బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా నల్గొండ బార్ అసోసియేషన్ హాల్లో న్యాయవాదులనుద్దేశించి మాట్లాడారు. అభివృద్ధి పదాలకు తీసుకెళ్తానని కోరడం జరిగింది.ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి గిరి , లింగయ్య గౌడ్ , నూకల నరసింహా రెడ్డి, మాలే వెంకట్ రెడ్డి, పివి శ్యామ్ సుందర్ రావు, గాలి శ్రీనివాస్, గుండాల నరేష్, చుక్కల నాగరాజు, హరికుమార్ మరియు సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.