byసూర్య | Thu, May 02, 2024, 03:49 PM
బీజేపీ పార్టీవైపు యువకులంతా మొగ్గు చూపుతున్నారనీ ఎంపీ అభ్యర్థి సైదిరెడ్డి అన్నారు. మిర్యాలగుడలో టీఆర్ఎస్ కు చెందిన యువ నాయకులు బీజేపీలో చేరగా వారికి నల్గొండ బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి పార్టీ కండువా కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను చూసే యువకులంతా పార్టీలో చేరుతున్నారని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువతది కూడా కీలకపాత్ర అని తెలిపారు. రానున్న రోజుల్లో యువతకు మోడీపాలనలో మంచి రోజులు రాబోతున్నాయని పేర్కొన్నారు.