byసూర్య | Thu, May 02, 2024, 03:05 PM
ఆదిలాబాద్ జిల్లా నెరడిగొండ మండలంలోని వెంకటపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కృష్ణ ను బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాధవ్ పరామర్శించారు. మాజీ సర్పంచ్ మాతృ మూర్తి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అనిల్ జాధవ్ గురువారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట ఎంపిపి సజన్, నాయకులు రవి, ప్రతాప్, సద్దాం హుస్సేన్, బాబులాల్ తదితరులు ఉన్నారు.