byసూర్య | Fri, Apr 19, 2024, 11:36 AM
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీ చంద్ర రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న క్రమంలో జిల్లా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. సీఎం పర్యటనకు మొత్తం 1, 500 మందితో బందోబస్తు ఉండనున్నారు. 4 ఏఎస్పిలు, డీస్పీలు 15, సీఐలు 75, ఎస్ఐలు , 100 ఎడిఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు కలిపి 1, 306 మంది విధులలో ఉండనున్నారు.