byసూర్య | Fri, Apr 19, 2024, 11:37 AM
కొల్లూరు ఔటర్ రింగ్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున ముందువెళ్తున్న లారీని కారు ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు చంద్రాయన గుట్ట ఓల్డ్ సిటీకి చెందిన మహమ్మద్ మున్నావర్ (35), ఫాతిమా బేగంగా గుర్తించారు పోలీసులు. గాయాలైన నలుగురు జాఫర్, సర్వార్, షఫీ, గున్ బాషలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.