byసూర్య | Thu, May 02, 2024, 02:43 PM
ఐపీఎల్ 2024లో భాగంగా నేడు సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7.30కి ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. ఈ మ్యాచ్ సన్రైజర్స్కు చాలా కీలకం. ఎందుకంటే ప్రస్తుతం ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా ఉంది. ఇప్పటికే ఓ ప్లేస్ రాజస్థాన్ దాదాపు ఖరారు చేసుకోగా మిగిలిన మూడు స్థానాల కోసం 7 జట్లు తలపడుతున్నాయి. దాంతో రాజస్థాన్తో మ్యాచ్ సన్రైజర్స్కు కీలకంగా మారింది.ఈ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో ఏకంగా 8 నెగ్గి16 పాయింట్లతో పట్టికలో మొదటి స్థానంలో ఉంది. ఇటు సన్రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ పై ఈ మ్యాచ్ గెలవాలని చూస్తుంది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లమధ్య 18 మ్యాచ్ లు జరగా చెరో తొమ్మిది మ్యాచ్ లు విజయం సాధించాయి. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.