byసూర్య | Thu, Apr 18, 2024, 03:34 PM
పిట్లం మండలం రాంపూర్(కలన్)లో గురువారం శ్రీరామ దేవాలయం వద్ద జరుగుతున్న అఖండ హరినామ సప్తహ కార్యక్రమం చివరి రోజు కావడంతో పోచయ్య మహారాజ్ ఆధ్వర్యంలో కలశం, నిండు బిందెలతో గ్రామంలోని ప్రధాన విధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్ళారు. అనంతరం పోచయ్య మహారాజ్ కీర్తనలు వినిపించారు. భక్తులకు తీర్థ ప్రసాదాన్ని పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో రాంపూర్ గ్రామ భజన మండలి సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.