byసూర్య | Wed, Apr 17, 2024, 08:45 PM
నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. అద్దంకి-నార్కట్పల్లి హైవేపై జరిగిన ప్రమాదంలో బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సాధినేని జనార్దన్రావు(48) మృతి చెందారు. బైక్పై పట్టణానికి వస్తుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో జనార్ధన్ కిందపడి తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు.