byసూర్య | Wed, Apr 17, 2024, 01:46 PM
వనపర్తి జిల్లా మదనాపురం మండలం దంతనూర్ గ్రామంలో బుధవారం శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారాముల కల్యాణం వేద బ్రాహ్మణులు అయిన శ్రీనివాస చారి వేదమంత్రాలతో వడ్ల నాగరాజు ఆచారి దంపతులు, పబ్బా నాగరాజు గౌడ్ దంపతులచే వైభవంగా నిర్వహించారు. కళ్యాణము అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, మహిళలు, హిందువాహిని సభ్యులు పాల్గొన్నారు.