byసూర్య | Wed, Apr 17, 2024, 01:45 PM
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలంలో మంగళవారం భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన నాయకులపై బుధవారం భారత రాష్ట్ర సమితి పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు పదవులు హోదాలు అనుభవించి, పార్టీ అధికారం నుంచి దూరం కాగానే కష్టకాలంలో పార్టీని వదిలిపెట్టి అధికారం కోసం మళ్ళీ అధికార పార్టీలోకి చేరారని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.