byసూర్య | Wed, Apr 17, 2024, 01:42 PM
వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో బుధవారం శ్రీరామనవమి పండుగ సందర్భంగా ఇన్విటేషన్ రెండు బండ్ల ఎద్దుల గిరక పోటీలను మూలమల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పి రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతాపరెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలో 20 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ గిరిక పోటీలను తిలకించేందుకు వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.